GPL (గబ్బర్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ (లోధా అపార్ట్మెంట్) ప్రక్కన ఉన్న GHMC గ్రౌండ్ లో గబ్బర్ స్పోర్ట్స్ శేషుబాబు, తుంగల నాయుడు, విష్ణు తేజ,శంకర్ , శ్రీకాంత్, విన్నకోట వారి ఆహ్వానం మేరకు, (GPL) గబ్బర్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, జెఎన్టియు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) మౌనికారెడ్డి, నందకుమార్ పాల్గొన్నారు.క్రికెట్ టోర్నమెంట్ ను ప్రేమకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు వారికి పూల గుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చే మార్గమని అన్నారు. అలాగే కాలనీ స్థాయి



Comment List