తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎస్ వెంకటేశ్వర్

తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎస్ వెంకటేశ్వర్

ఐ ఎన్ బి టైమ్స్ దొరవారిసత్రం మే 22:దొర వారి సత్రం మండలం లోని తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని జిల్లా కలెక్టర్  డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్  సందర్శించారు. గురువారం తల్లంపాడు గ్రామంలో పి. యం. డి. ఎస్ పైరు 11 రకాల విత్తనాల్ని గోవర్ధన్ అనే రైతు పోలం లో వేయడం జరిగింది. వీటి వల్ల ఉపయోగాలని గ్రామ రైతులకు  ఏపీ సీఎన్ ఎఫ్ డిపిఎం శ్రీ షణ్ముగం మరియు ఏడిఏ అగ్రికల్చర్ G. అనిత కలెక్టర్ వివరించడం జరిగినది వీటిని వేసుకొని భూమి సారవంతం అవుతుందని తేమశాతం ఎక్కువ సమయం నిలుపుకుంటుందని తద్వారా ఎరువులవాడకాన్ని తగ్గించుకోవచ్చని గ్రామంలోని రైతులందరికీ కూడా వివరించడం జరిగింది.కలెక్టర్  మాట్లాడుతూ పి యం డి ఎస్ కిట్స్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 వేల ఎకరాలలో ఈ సంవత్సరము వేయించే విధంగా ప్రణాళిక సిద్ధపరచద్దపరచబడిందని తెలియజేయడమైనది. తల్లంపాడు గ్రామంలో గోవర్ధన్ వేసిన రెండు రకాల మినుము పంటను కూడా సందర్శించడం జరిగినది.  గ్రామ రైతులు నెర్రి కాలవ బాగు చేసి గ్రామంలో ఉన్న 150 ఎకరాలకి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కలెక్టర్ విన్నవించుకోవడం జరిగినది వ్యవసాయ శాఖ ద్వారా మరియు ఏపీ సీఎన్ ఎఫ్ సిబ్బంది ద్వారా పిఎండిఎస్ కిట్స్ రైతులుకి అందించి వారి పొలాల్లో వేసే లాగున చర్యలు చేపట్టాలని అధికారులకి సూచించడమైనది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ టన్నులు రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వారు రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది,  దొరవారి సత్రం మండల వ్యవసాయ అధికారి జ్యోతిర్మయి , మండల గ్రామస్థాయి అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Views: 17

Advertisement

Latest News

వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం ప్రతినిధి జూన్ 1: రాజుపాలెం మండలం పెద నెమలిపూరి  గ్రామంలో  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని....
ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహిస్తున్న రేషన్ డీలర్లు 
డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం
బాలుడి మృతి కేసులో  ముగ్గురికి రిమాండ్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎస్ వెంకటేశ్వర్
నవజీవన్ ఆర్గనైజేషన్-సి.సి-ఎపిశాక్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పై అవగాహన