తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
ఐ ఎన్ బి టైమ్స్ సూళ్లూరుపేట మే 22:అమృత స్టేషన్లో భాగంగా 15 కోట్లతో పునరాభివృద్ది చేయబడిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెట్ కేటాయించింది లేదని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్ లో భాగంగా భారతదేశంలో మొత్తం 103 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందుచూపుతో ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టి రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు వెళుతుందని తెలిపారు.
గత వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అటు అమరావతి, పోలవరం, పూర్తిచేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వైసిపి నాయకులు చెప్పే అబద్ధపు మాటలను నమ్మవద్దని, కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం ఓటమి ప్రభుత్వ సారాధ్యంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ,మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, మరియు బిజెపి జనసేన తెదేపా నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Comment List