బాలుడి మృతి కేసులో ముగ్గురికి రిమాండ్
ఐ ఎన్ బి టైమ్స్ సత్యవేడు మే 22:తొమ్మిదేళ్ల బాలుడిని పనిలో పెట్టుకుని, బాలుడి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను తిరుపతి జిల్లా సత్యవేడు పోలీసులు రిమాండ్ కు తరలించారు.పుత్తూరు డిఎస్పి రవికుమార్ తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి....తిరుపతి జిల్లా గూడూరు మండలం నెల్ల టూరు పంచాయతీ చవట గిరిజన కాలనీకి చెందిన అంకమ్మ, చెంచయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. ట్రాక్టర్ కూలీగా పనిచేసే చెంచయ్య నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (9), కుమార్తెను వెంటతీసుకుని కూలి పనులకు సత్యవేడు పంచాయతీ దళవాయి అగ్రహారానికి వచ్చింది. రెండేళ్ల క్రితం అక్కడ బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిలో చేరింది. పది నెలల క్రితం పని మానేయడంతో అడ్వాన్సు తిరిగివ్వాలని యజమాని ముత్తు పట్టుబ ట్టాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె. తాను డబ్బులు తిరిగి చెల్లించేదాకా తన తొమ్మిదేళ్ల కొడుకు వెంకటేశ్వర్లును బాతులు మేపే పనికి పెట్టుకోవాలని అక్కడే వదిలి పెట్టి స్వగ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో బాతుల యజమాని ముత్తు బాలుడిని తీసుకుని బాతుల మేపేందుకు తమిళనాడు రాష్ట్రం కంచి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు . ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీ బాలుడు వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బాలుడిని కంచి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ ఏప్రిల్ 12వ తేదీన మృతి చెందాడు. దీంతో బాతు యజమాని ముత్తు అతని భార్య ధన భాగ్యం, కుమారుడు రాజశేఖర్ కు సమాచారం ఇచ్చారు. అయితే వీరు బాలుడి మృతదేహాన్ని తల్లి అంకమ్మకు అప్పజెప్పకుండా బాతుల మేపే పరిసర ప్రాంతాల్లోని పాలారు నదిలో పూడ్చిపెట్టారు. అయితే తనతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్న కుమారుడు నుంచి నెల రోజులుగా కొడుకు నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో సత్యవేడు వచ్చిన ఆమె.. తన కొడుకు ఎక్క డని ముత్తును ప్రశ్నించింది. అయితే ముత్తు కుటుంబ సభ్యులు అంకమను కులం పేరుతో దూషించి, బయటకి గెంటేశారు. రోజులు గడుస్తున్నా కొడుకు జాడ తెలియకపోవడంతో ఆవేదన చెందిన అంక మ్మ ఈనెల 19వ తేదీన సత్య వేడు పోలీసులను ఆశ్రయించింది. పుత్తూరు డిఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ముత్తును అదుపులోకి తీసుకుని విచారిం చగా.. బాతులు మేపేందుకు బాలుడిని తమిళనాడు లోని కంచి ప్రాంతానికి తీసుకెళ్లగా , అక్కడ అనారో గ్యానికి గురై చనిపోతే మృతదేహాన్ని ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారని తేలింది. దీంతో ఈ నెల 20వ సత్యవేడు పోలీసులు కంచికి చేరుకుని బాలుడి మృతదేహం కోసం గాలించారు. తమిళనాడు పోలీసుల సాయంతో 21వ తేదీ సాయంత్రం బాలుడి మృతదేహాన్ని పూడ్చిన చోట తవ్వించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ అవశేషాలను చెంగల్పట్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడి ఉతికి కారణమైన ముత్తు, అతని భార్య ధన భాగ్యం, ఆమె కుమారుడు రాజశేఖరంపై బాల కార్మిక నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు తో పాటుపల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Comment List