ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహిస్తున్న రేషన్ డీలర్లు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జూన్ 01:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురు 0719028 చౌకధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులు పంపిణీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రేషన్ డీలర్స్ జడ రామారావు, జడ గురవయ్య అలాగే వారు మాట్లాడుతూ నెల మొదటి రోజు నుండి 15వ తారీకు వరకు ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకులు పంపిణీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు రేషన్ సరుకులు ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8గంటల వరకు ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులను అందజేస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ వరకు రేషన్ షాపులో ద్వారా నిత్యవసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వారు తెలియజేశారు. అలాగే రేషన్ సరుకుల పంపిణీ నిర్వహణ సజావుగా నడుస్తుందో లేదో తెలుసుకొనుటకు తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలు విచ్చేశారు. అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని పేదల కష్టంలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేదల కష్టాలు చూడలేక స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు నిరుపేదలు ఆకలి కడుపు నింపడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని పేద ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావు కి మాత్రమే దక్కుతుందని వారు అన్నారు. పేద ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేయటానికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలను అందజేస్తుందని ముటుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, రేషన్ డీలర్లు, ముటుకూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comment List