రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

జమ్మలమడక ఘటనపై  ఎమ్మెల్యే  జూలకంటి ఆగ్రహం.

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ మూకలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హెచ్చరించారు.  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం, దౌర్జన్యం, దాడులు, అవినీతి కేసుల్లో  జీవితాంతం జైల్లో ఉంటారని, ఆయనతోపాటు వైసీపీ నాయకులను, కార్యకర్తలను తోడు తీసుకొని వెళ్లేందుకే  పల్లెల్లో అలజడులను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, ఇటువంటి దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు.  హత్యా రాజకీయాలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. దాడులు వెనక ఎంతటి వారు ఉన్నా, చట్టపరంగ శిక్షించబడతారని  బాధిత కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాచర్ల పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:
Views: 122

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం