రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

జమ్మలమడక ఘటనపై  ఎమ్మెల్యే  జూలకంటి ఆగ్రహం.

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ మూకలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హెచ్చరించారు.  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం, దౌర్జన్యం, దాడులు, అవినీతి కేసుల్లో  జీవితాంతం జైల్లో ఉంటారని, ఆయనతోపాటు వైసీపీ నాయకులను, కార్యకర్తలను తోడు తీసుకొని వెళ్లేందుకే  పల్లెల్లో అలజడులను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, ఇటువంటి దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు.  హత్యా రాజకీయాలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. దాడులు వెనక ఎంతటి వారు ఉన్నా, చట్టపరంగ శిక్షించబడతారని  బాధిత కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాచర్ల పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:
Views: 120

Advertisement

Latest News

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 
SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం
ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.