డ్రైవర్స్ కాలనీలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ...పాల్గొన్న కూటమి నాయకులు, వీఆర్వో..
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 27:కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక డ్రైవర్స్ కాలనీలో బుధవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీ లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ రేషన్ స్మార్ట్ కార్డుల విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంటుందని ఈ సందర్భంగా కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు పాలాడి శ్రీనివాసరావు(తెదేపా), టౌన్ యూత్ అధ్యక్షులు దోసపాటి సుబ్బారావు (జనసేన), మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, సండ్రు బుచ్చిరాజు (జనసేన), కవల ప్రసాద్ (జనసేన), పడాల చిన్న (జనసేన), వీఆర్వో వెంకటరమణ, రేషన్ డీలర్, రేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు...
Comment List