అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులుకు తెలుగు తేజం అవార్డు బహూకరణ

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అవార్డు బహుకరణ

అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులుకు తెలుగు తేజం అవార్డు బహూకరణ

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 02గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జన్మదినమైన  ఆగస్టు 29 న, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, శ్రీ శ్రీ కళావేదిక వారు తెలుగు తేజం అవార్డులను పల్నాడు జిల్లా కేంద్రమైన  నరసరావుపేటలోని, భువనచంద్ర టౌన్ హాల్ నందు ఆదివారం అందించుట జరిగినది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి చెందిన అధ్యాపకులు ఆవుల వెంకట వీరాంజనేయులు యూనివర్సల్ ఫౌండేషన్ను స్థాపించి విద్యా, క్రీడలు, కళలు, దివ్యాంగులు, అంధులు మరియు పలు రంగాల అభివృద్ధికై కృషి చేస్తున్నందుకుగాను తెలుగు తేజం అవార్డును అందుకోవడం జరిగినది. వారి కుమార్తెలు గానము మరియు నృత్యాలతో అతిధులను, తెలుగు కవులను మరియు ప్రేక్షకుల అందరినీ అలరించారు.

Tags:
Views: 29

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం