పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మట్టి గణేష్ ప్రతిమలు పంపిణీ
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 27:
మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, సూచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖా మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సంధర్భంగా చిట్టెంశెట్టి బ్రదర్స్ మట్టి గణేష్ ప్రతిమలు పంపిణీ చేశారు.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హిందూ దేవాలయాలు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులు విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమయం దొరికినప్పుడల్లా సమాజసేవ చేసే చిట్టెంశెట్టి బ్రదర్స్ మరోక ముందడుగుతో పండుగ సంధర్భంగా మట్టి గణేష్ ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. నాలుగేళ్ళ నుండి పూజా విధానం తెలియజేసే పుస్తకాలతో పాటు ఇలా గణేష్ ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు
రాజుపాలెం మెయిన్ రోడ్ లో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో నిర్వాహకులు చిట్టెంశెట్టి గోపి, చిట్టెంశెట్టి నరేంద్ర మరియు పగడాల శ్రీనివాసరావు, చొక్కా మల్లికార్జునరావు, దుడుకు రామారావు, కేదారి రమేష్, కొజ్జా శ్రీనివాసరావు, లేబాకుల వెంకటేష్, తొర్లికొండ నాగ మల్లేశ్వరరావు, ఉగ్గం శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List