ఆంధ్ర రాష్ట్ర ఆపద్భాందవునికి ఆకు పూజ

ఆంధ్ర రాష్ట్ర ఆపద్భాందవునికి ఆకు పూజ

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి సెప్టెంబర్ 2:
ఆంధ్ర రాష్ట్ర ఆపద్భాందవుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సంధర్భంగా మంగళవారం తెల్లవారుఝామున తొలి పూజగా కోళ్ళూరు శ్రీ ప్రసన్నాంజనేయే స్వామి వారి దేవస్థానంలో ఆకుపూజ నిర్వహించినట్లు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్ తెలిపారు.ఆయన జన్మదినం మా పార్టీ కార్యకర్తలకు ఒక పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు మేము కార్యకర్తలమో లేదా అభిమానులమో అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. మేము ఆయన భక్తులమని అభిమానాన్ని చాటారు.
వారి అభిమాన నాయకుడిపై వారికున్న ప్రేమను, భక్తిని, ఆరాధనను మాటల్లో చెప్తూ. ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందంటే, ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ ఆయన తెలిపారు.ఈ తరం చూసిన ఛత్రపతి శివాజీ మా పవన్ కళ్యాణ్ అన్న గారని మాట్లాడారు. చివరిగా అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పూజా కార్యక్రమంలో సర్పంచులు పసుపులేటి వెంకటస్వామి, కుందురు పేతురు, చొక్కా మల్లికార్జునరావు, పగడాల శ్రీనివాసరావు, కొజ్జా శ్రీనివాసరావు, సమారి సైదారావు, చిట్టెంశెట్టి గోపి, చిట్టెంశెట్టి నరేంద్ర, గుడారి గంగారావు, సఖినాల ధర్మారావు తదితరులు పాల్గొన్నారు

Ad
 

 

Tags:
Views: 25

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు