వినాయక ఉత్సవ కమిటీలు నియమ, నిబంధనలు పాటించాలి.. అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) చెంచురెడ్డి..

వినాయక ఉత్సవ కమిటీలు నియమ, నిబంధనలు పాటించాలి.. అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) చెంచురెడ్డి..

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 27:వినాయక ఉత్సవ కమిటీలు నియమ, నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను ప్రమాద రహితంగా జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) చెంచురెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం నాడు ఆయన గోకవరం మండలంలోని వినాయక ఉత్సవ మండపాలను పరిశీలించి, ఉత్సవ కమిటీలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలను పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలను జరిపించుకోవాలన్నారు. చుట్టు ప్రక్కల వారికి ఇబ్బందులు కలిగించే డీజే సౌండ్స్ ఉపయోగించకూడదని తెలిపారు. పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహబంధాలు కలిగి ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించినచో ఆ కమిటీలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఎస్ పి (ఏఆర్) చెంచురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad
 

 

Tags:
Views: 7

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం