మాచర్ల రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేశుని విగ్రహ ప్రతిమలు అందజేత

మాచర్ల రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేశుని విగ్రహ ప్రతిమలు అందజేత

ఐఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 27:పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి గణేశుడి విగ్రహ ప్రతిమలు పార్క్ సెంటర్ లో పట్టణ ప్రజలకు ఉచితంగా బుధవారం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రోటరీ, మాచర్ల అధ్యక్షులు తుమ్మల సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు జల కాలుష్యానికి మూల కారణమైన ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా, రోటరీ క్లబ్ తరపున 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల నందు 100 మొక్కలు నాటిన రోటరీ క్లబ్ సభ్యులుమాచర్ల పట్టణంలో 3150రోటరీ డెసిగ్నేషన్ డే ను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన మాచర్ల పట్టణ ప్రభుత్వ వైద్యశాల నందు 100 మొక్కలు నాటడం జరిగినది...
 మాచర్ల పట్టణంలో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను పలువురు పట్టణ ప్రజలు కొనియాడడం జరిగినది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తుమ్మల ప్రసాద్, కార్యదర్శి ఆలేటి కోటేశ్వరరావు,కోశాధికారి యనమదల వెంకట్రామయ్య మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ రామకోటయ్య, నాగూర్ వలి,సిద్ధం రాజు,రామ్మూర్తి,శంకర్ సత్యనారాయణ, గుండా నాగేశ్వరరావు,పోలూరు శ్రీను, మేడం నాగేశ్వరరావు, తిర్లికా శ్రీనివాసరావు, ఎస్ నరసింహారావు,జెవికెఎస్ ప్రసాద్, చెరుకూరి నరసింహారావు, లీలా ప్రసాద్ మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Tags:
Views: 14

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం