ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా: న్యాయమూర్తి మీనాక్షి

ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా: న్యాయమూర్తి మీనాక్షి

ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి
 జూన్ 26:హాస్టల్ విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? అంటూ నాయుడుపేట సివిల్ కోర్టు జడ్జి మీనాక్షి ఆరా తీశారు. గురువారం ఆమె ఎస్ ఐ స్వప్నతో కలసి ఓ చెలి మండల పరిధిలోని, మాకాటి వారి కండ్రిగలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆమె మొదటిగా వంటశాలలో తయారు చేసి ఉన్న ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. పిల్లలకు ఆహార పదార్థాలతో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా రుచికరంగా వండి వంటించాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలు, విద్యార్థుల బోధన పలు విషయాలపై గురుకుల పాఠశాల అధికారులతో చర్చించారు. అటు విద్యాబోధనలో కానీ, ఆహార పదార్థాల నాణ్యతలో కానీ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Views: 31

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత