తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు, ఉదయం నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాసాలు ఉండి శ్రీ మహా విష్ణువుకి ఇష్టమైన ఏకాదశిని దేవాలయాలల్లో అత్యంత వైభ వంగాజరుపుకున్నారు.భక్తులు స్వామిని దర్శించుకొని మోక్షంను ప్రసాదించు అనికోరుకున్నారు. హిందువులకు అత్యంత విశిష్టతమైన, పవిత్రమైన పండుగ తొలిఏకాదశి అని పంచాంగకర్తలు వేదమంత్రాలతో ఉపదేశించారు.దీనిని పేలాల పండుగ అనికూడా పిలుస్తారు అన్నారు
ఆషాడమాసంలో వచ్చే మొదటి ఏకాదశి నితొలి ఏకాదశి అని అంటారన్నారు.ఈ ఏకాదశి నుంచే పండుగలు మొదల వుతాయి కాబట్టి దీనిని తొలి పండుగ అనికూడా పిలుస్తారన్నారు.ఈ రోజు దుర్గిలోని బుగ్గ మల్లయ్య స్వామి దేవాలయంలో భక్తులు, ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు.బక్తులు దేవాలయాల్లో రాత్రంతా జాగరణ చేస్తూ భగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారి కృపకు పాత్రుల య్యారు.తొలిఏకాదశి జాతర మహోత్సవంనువిజయవంతం చేశారు.భక్తులకుఅవసరమైన సకల సౌకర్యాలను నిర్వాహ కులు, గ్రామ పెద్దలు ఏర్పాటు చేశారు.
Comment List